ప్రజావాణి ఆర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి.

జిల్లా కలెక్టర్ బి, సత్య ప్రసాద్

 

సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను స్వీకరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి వస్తారని, అధికారులు వారి శాఖల వారిగా స్వీకరించి ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించడంతో పాటు సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. కాగా ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 50 ఫిర్యాదులు, వినతులు వచ్చాయని వాటిని వెంటనే సంబంధిత అధికారులను పరిష్కరించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.

 

ఈ కార్యక్రమంలో,అదనపు కలెక్టర్ బి, ఎస్ లత, ఆర్డీవోలు మధు సుధను, జివాకర్ రెడ్డి, శ్రీనివాస్ వివిధ జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ పర్యవేక్షకులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.@TelanganaCMO @TelanganaCS @IPRTelangana

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here